మహేశ్వరం,జూలై20: తెలంగాణలో కొలువుల జాతర మొదలైందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. మంగళవారం మహేశ్వరంలో నిరుద్యోగ యువతకు డీఆర్డీఓ రంగారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా జాబ్మేళాలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే రాష్ట్రం పెట్టుబడులకు నిలయంగా మారిందన్నారు. జాబ్ మేళా ద్వారా నిరుద్యోగులకు కొలువులు వస్తున్నాయని ఆమె అన్నారు. ఈ మేళాలో 733 మందిని ఎంపిక చేశారని,ఇందులో 462 మందికి నేరుగా, 271మందికి శిక్షణ ఇస్తారని ఆమె అన్నారు. నిరుద్యోగ యువతీయువకులు ఈమేళాను సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు. త్వరలోనే కందుకూ రు,జల్పల్లి,ఇబ్రహీంపట్నంలో జాబ్మేళాలను ఏర్పాటు చేస్తామని ఆమె తెలిపారు. కార్యక్రమంలో డీఆర్డీఓ ప్రభాకర్,డీఆర్డీఓ జేడీఎం హమీద్, ఎంపీడీవో నర్సింహులు, ఎంపీపీ రఘుమారెడ్డి, వైస్ఎంపీపీ సునీతాఆంధ్యానాయక్, మండల పార్టీ అధ్యక్షుడు చంద్రయ్య,సహకార బ్యాంక్ చైర్మన్ యాదవ్,వైస్చైర్మన్ వెంకటేశ్వర్రెడ్డి,మార్కెట్ కమిటీ చైర్పర్సన్ వరలక్ష్మీసురేందర్రెడ్డి కో ఆప్షన్ సభ్యులు ఆదిల్అలీ ఎంపీటీసీ సుదర్శన్యాదవ్ నాయకులుయాదయ్య,చంద్రయ్య,సర్పంచ్లు సురేఖకరుణాకర్రెడ్డి,వీరానాయక్,పద్మపాండు, రమేశ్,రాజేశ్, శ్రీనివాస్రెడ్డి,ఎంఏ సమీర్, శ్రీనివాస్రెడ్డి డైరెక్టర్లు ప్రభాకర్,బాలయ్య,అశోక్కుమార్, నిరుద్యోగులు ఉన్నారు.