కందుకూరు, జూలై 16 : హైదరాబాద్-శ్రీశైలం జాతీయ రహదారిపై సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు కోసం కృషి చేసినట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. కేంద్ర మంత్రితో పాటు జాతీయ రహదారుల అధికారులతో మాట్లాడి రూ.4కోట్ల 32లక్షల నిధులను మంజూరు చేయించినట్లు చెప్పారు. శుక్రవారం మండల ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు సురుసాని రాజశేఖర్రెడ్డి, టీఆర్ఎస్ యువజన విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ తాళ్ల కార్తీక్, సోషల్ మీడియా కన్వీనరు బొక్క దీక్షిత్రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు కాసోజు ప్రశాంత్చారి మంత్రిని కలిసి హైదరాబాద్, శ్రీశైలం రహదారి కందుకూరు మండల కేంద్రంలో వాన వస్తే రోడ్డుపై నీరు నిల్వడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారన్నారు. పరిష్కారం కోసం రూ.30లక్షల 64వేలు మంజూరు అయ్యాయని తెలిపారు. త్వరలో పనులను ప్రారంభిస్తారని చెప్పారు. కందుకూరు, కడ్తాల్, మైసిగండి, విఠాయిపల్లి, ఆమనగల్లు, వెల్దండతో పాటు డిండి పట్టణాల్లో సెంట్రల్ లైంటింగ్ సిస్టం ఏర్పాటు చేస్తారని చెప్పారు. నడవడానికి వంతెనలు ఏర్పాటు చేస్తారని వివరించారు. జాతీయ రహదారి ఆభివృద్ధికి కోసం కృషి చేస్తున్న అధికారులను మంత్రి అభినందించారు.