పహాడీషరీఫ్, జూలై 13 : సీఎం సహాయనిధి పేదలకు వరమని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. జల్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని ‘వాది ఏ ముస్తఫా కాలనీకి’ చెందిన మోసిన్ఖాన్ కూతురు అక్సాఖాన్ ఇటీవల అనారోగ్యానికి గురి కావడంతో ఓ ప్రైవేట్ దవాఖానలో చికిత్స చేయిస్తున్నారు. దవాఖాన ఖర్చు నిమిత్తం సీఎం రిలీఫ్ ఫండ్కు దరఖాస్తు చేసుకోగా రూ. 50వేలు మంజూరు కావడంతో ఆ చెక్కును మంగళవారం మంత్రి సబితా ఇంద్రారెడ్డి తన నివాసంలో బాధితురాలు తల్లికి అంద జేశారు. కార్యక్రమంలో జల్పల్లి కో-ఆప్షన్ మెంబర్ సూరెడ్డి కృష్ణారెడ్డి, టీఆర్ఎస్ నాయకులు యూసుఫ్ పటేల్, షేక్ అప్జల్, యంజాల జనార్దన్, ఎమ్మార్పీఎస్ నాయకుడు అర్జున్ పాల్గొన్నారు.
బడంగ్పేట, జూలై 13 : ఆపదలో ఉన్న వారికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆపన్నహస్తం అందిస్తున్నారని మంత్రి సబి తా ఇంద్రారెడ్డి అన్నారు. మీ ర్పేట మున్సిపల్ కార్పొరేష న్ పరిధిలోని జిల్లెలగూడకు చెందిన సాగర్రెడ్డికి మంత్రి రూ. 60వేల చెక్కును అందజేశారు. నియోజకవర్గం వ్యా ప్తంగా ముఖ్యమంత్రి సహాయనిధికి దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూరిందన్నారు. కష్టకాలంలో సీఎం రిలీఫ్ ఫండ్ ఎంతో మందికి ఉపయోగపడుతుందన్నారు. కార్యక్రమంలో లక్ష్మణ్ముదిరాజ్ ఉన్నారు.