కందుకూరు, జూన్ 23 : రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న రైతు వేదికలు దేశానికి ఆదర్శమని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి తెలిపారు. కందుకూరు మండల కేంద్రంతో పాటు నేదునూరు గ్రామంలో నిర్మించిన రైతు వేదికలను బుధవారం జిల్లా పరిషత్ చైర్పర్సన్ తీగల అనితారెడ్డితో కలిసి ప్రారంభించారు. అనంతరం మండల కేంద్రంలో రూ. 10 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల సర్పంచ్లు కాసుల రామకృష్ణారెడ్డి, సాధ మల్లారెడ్డి, శమంతకమణిల ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ రైతుల సంక్షేమం కోసం దేశంలో ఎక్కడాలేని విధంగా రాష్ట్ర వ్యాప్తంగా 5వేల ఎకరాలను క్లస్టర్లుగా చేసి 2వేల 600రైతు వేదికలను నిర్మించినట్లు చెప్పారు. సీఎం కేసీఆర్ను స్ఫూరిగా తీసుకొని పని చేయాలని సూచించారు. రైతు వేదికలు దేవాలయాలని, రైతులకు కులం , మతాలు లేవన్నారు.
రైతులు సంఘటితం గా ఉంటూ పంటలను బాగా పండించాలని కోరారు. ప్రభుత్వంపై రైతులకు నమ్మకం, విశ్వాసం కలిగిందని అదేవిధంగా ప్రభుత్వం కూడా రైతులకు భరోసా ఇస్తుందన్నారు. రైతు బంధు, రైతు బీమా లాంటి పథకాలను తీసుకొచ్చి రైతులకు ప్రభుత్వం అండగా నిలుస్తుందన్నా రు. పాత జిల్లాలైన రంగారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాల గ్రామాలకు సాగునీరును తీసుకొస్తామని తెలిపారు. అం దుకోసం సీఎం కేసీఆర్ కూడా సానుకూలంగా ఉన్నట్లు చెప్పారు. అనంతరం జడ్పీ చైర్పర్సన్ మాట్లాడుతూ రైతు లు ఆర్థికంగా ఎదగాలన్నారు. జిల్లాలో 83 క్లస్టర్లకు ప్రభు త్వం రూ. 19 కోట్లు మంజూరు చేసినట్లు రైతు సమన్వ య సమితి జిల్లా అధ్యక్షుడు వంగేటి లక్ష్మారెడ్డి తెలిపారు.
కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి గీత, జిల్లా గ్రం థాలయ చైర్మన్ కప్పాటి పాండురంగారెడ్డి, జడ్పీటీసీ బొ క్క జంగారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ సురుసాని వరలక్ష్మి, ఎంపీపీ మంద జ్యో తీపాండు, వైఎస్ ఎంపీపీ శమంతాప్రభాకర్రెడ్డి, పీఎసీఎస్ చైర్మన్ దేవరశెట్టి చం ద్రశేఖర్, వైస్ చైర్మన్ గోపిరెడ్డి విజేందర్రెడ్డి, సర్పంచ్లు గొరిగె కళమ్మ రాజు, గోవర్ధ్దన్, రాము, శమంతకమణి, శ్రావణి, శ్రీనివాస్, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు సురుసాని రాజశేఖర్రెడ్డి, ఎంపీటీసీలు బొక్క జ్యోతి, యాద య్య, డైరెక్టర్లు ఆనంద్, ప్రకాశ్రెడ్డి ఇందిరమ్మ, టీఆర్ఎస్ పార్టీ నాయకులు గంగాపురం లక్ష్మీనర్సింహారెడ్డి, సురేందర్రెడ్డి, వివిధ పార్టీల ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
మహేశ్వరం, 23 జూన్ : ప్రభుత్వ పాఠశాలలకు పక్కా భవనాలను నిర్మిస్తామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. బుధవారం మహేశ్వరం మండల కేంద్రంలో సర్వే నంబర్ 319లో స్కూల్ నిర్మాణం కొరకు జడ్పీ చైర్పర్సన్ తీగల అనితారెడ్డితో కలిసి ఆమె స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 3 ఎకరాలలో సువిశాలంగా తెలుగు, ఇంగ్లీషు మీడియం విద్యార్థుల కోసం అత్యాధునికంగా స్కూల్ భవనాలను నిర్మిస్తామన్నారు. సక్సెస్ స్కూల్కు కోటి రూపాయలను మంజూరు చేశామని అవసరమనుకుంటే అదనంగా మరో కోటి రూపాయలతో స్కూల్ను ఆదర్శంగా తీర్చిదిద్దుతామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రఘుమారెడ్డి, కో-ఆప్షన్ సభ్యులు ఆదిల్అలీ, సహకారబ్యాంక్ వైస్ చైర్మన్ వెంకటేశ్వర్రెడ్డి, నాయకులు చంద్రయ్యముదిరాజ్, సమీర్, సుధాకర్రెడ్డి, దోమ శ్రీనివాస్రెడ్డి, నవీన్, అంబయ్యయాదవ్ పాల్గొన్నారు.