బడంగ్పేట / పహాడీషరీఫ్, జూన్5 : మానవ మనుగడ కోసం ప్రతి ఒ క్కరూ మొక్కలు నాటి పచ్చదనం పెంపొందించాలని విద్యాశాఖ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి అన్నారు. బడంగ్పేట ప్రభుత్వ ఉన్నత పాఠశాల, జిల్లెలగూడ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో, పహాడీషరీఫ్లోని ప్రీమియర్ ఫంక్షన్హాల్లో వ్యాక్సినేషన్ కేంద్రాలను మంత్రి ప్రారంభించారు. పర్యావరణ దినోత్సవం సందర్భంగా మొక్కలు నాటి నీళ్లు పోయాలని అన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రభుత్వం పెద్ద ఎత్తున హరితహారం చేపట్టిందన్నారు. ప్రభుత్వం కట్టదిట్టమైన నిర్ణయాలు తీసుకోవడంతో కొవిడ్ తగ్గుముఖం పట్టిందని, బ్లాక్ ఫంగస్పై ముందస్తు యంత్రాంగాన్ని అప్రమత్తం చేశామని అన్నారు.
కార్యక్రమంలోబడంగ్పేట మేయర్ చిగిరింత పారిజాత నర్సింహరెడ్డి, మీర్పేట మేయర్ దుర్గా దీప్లాల్ చౌహన్, డిప్యూటీ మేయర్లు ఇబ్రాం శేఖర్, తీగల విక్రంరెడ్డి, ఎంహెచ్వో దీన్ దయాల్, వైద్యులు శ్రీనివాస్, నర్సింగ్రావు, పహాడీషరీఫ్మున్సిపల్ చైర్మన్ అబ్దుల్లా సాది, కమిషనర్ కుమార్, మేనేజర్ ప్రకాశ్, కౌన్సిలర్లు శంషొద్దీన్, కెంచె లక్ష్మీనారాయణ, శ్రీధర్గౌడ్, హైమద్ కసాడి, ఖాలెద్ బిన్ అబ్దుల్లా తదితరులు పాల్గొన్నారు.
బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 30 డివిజన్ లోని సుబ్రమణ్యం కాలనీకి చెందిన లలితకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరైన రూ.27వేల చెక్కును కార్పొరేటర్ బీమిడి స్వప్న జంగారెడ్డి మంత్రి చేతుల మీదుగా అందజేశారు. మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని న్యూ గాయిత్రినగర్ 3వ డివిజన్ టీఆర్ఎస్ ఇన్చార్జి రేఖా రాణి బాల్ రాజ్ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బందికి మంత్రి చేతుల మీదుగా నిత్యావసర సరుకులు అందజేశారు.