ఆర్కేపురం, జూన్ 4 : ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా మహమ్మారి తొలిగిపోయి ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండేవిధంగా చూడాలని ప్రసన్నాంజనేయ స్వామివారికి మొక్కుకున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో తయారు చేసిన ఆభరణాలను హనుమాన్ జయంతి సందర్భంగా ఆర్కేపురం డివిజన్లోని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలోని శ్రీ దుర్గా అమ్మవారికి బంగారు కిరీటం, ప్రసన్నాంజనేయ స్వామివారికి గదను శుక్రవారం మంత్రి సబితాఇంద్రారెడ్డి అలంకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆలయ కమిటీ అభివృద్ధికి కృషి చేస్తున్న కమిటీ సభ్యులను మంత్రి అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆర్కేపురం డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు మురుకుంట్ల అరవింద్శర్మ, డివిజన్ ఇన్చార్జి రవీందర్రెడ్డి, ప్రధాన కార్యదర్శి పెండ్యాల నగేశ్, ధర్మకర్తలు పెంబర్తి శ్రీనివాస్, బి.ప్రశాంత్, వెంకటరమణ, రవీందర్రెడ్డి, మారం సుజాతరెడ్డి, ఎస్. మంజుల, జంగయ్య, శ్రీనివాస్గౌడ్, తాడెపల్లి వెంకటేశంగుప్తా, టీఆర్ఎస్ నాయకులు సాజిద్, పగిళ్ల భూపాల్రెడ్డి, కొండ్ర శ్రీనివాస్, శ్యామ్గుప్త, యాదవరెడ్డి, రాజు శ్రీవాస్తవ, ఊర్మిలారెడ్డి, ఆలయ ఈవో రంగారావు, ఆలయ రికార్డ్ అసిస్టెంట్ రామ్మోహన్రెడ్డి, పి. ఎల్లయ్య, జాహెద్, ఎస్.కె. మహ్మద్, శేఖర్, పాల్గొన్నారు.