కందుకూరు : గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. మార్కెట్ కమిటీ డైరెక్టర్ సామ ప్రకాశ్రెడ్డి శనివారం మంత్రిని కలిసి కొత్తగూడ లో అండర్ గౌండ్ డ్రైనేజీ, సీసీ రోడ్లకు నిధులను మంజూరు చేయాలని, విద్యుత్ అధికారులు దారికి అడ్డంగా నిర్మిస్తున్న ప్రహరీ నిర్మాణం వల్ల రైతులకు ఇబ్బందులు కలుగుతాయని ప్రహరీ ని నిర్మించకుండా చూడాలని, కొత్తగూడ నుంచి కొత్తూరు గ్రామానికి ఉన్న అంతర్గత రోడ్డు నిర్మాణానికి నిధులను మంజూరు చేయాలని కోరారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మారుమూల గ్రామాలను అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. గ్రామాల్లో మౌలిక వసతులు కల్పిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రం అన్ని రంగాల్లో దూసుకుపోతుంటే ప్రతి పక్షాలకు భయం పట్టుకొని ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారని తెలిపారు. ప్రతి పక్షాలకు తగిన బుద్ధి చెప్పాలని సూచించారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కప్పాటి పాండురంగారెడ్డి, టీఆర్ఎస్ మండల ఉపాధ్యక్షుడు సామ మహేందర్రెడ్డి, సౌడపు శంకర్గౌడ్, బొక్క శ్రీకాంత్రెడ్డి పాల్గొన్నారు.