మహేశ్వరం/ ఆర్కేపురం, మే 28 : సరూర్నగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జర్నలిస్టుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కొవిడ్ టీకా కేంద్రాన్ని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సమాచార సేకరణలో భాగంగా జర్నలిస్టులు అన్ని ప్రాంతాలకు వెళ్తుంటారని, అందుకు తప్పకుండా వ్యాక్సినేషన్ వేయించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారిణి డాక్టర్.అర్చన, ఐ అండ్పీఆర్ ప్రతినిధి ప్రశాంతి, టీయూడబ్ల్యూజే రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ కుమార్, జాతీయ కార్యవర్గ సభ్యుడు సత్యనారాయణ, అశోక్, శ్రీనివాస్రావు, బాలు, టీఆర్ఎస్ నాయకులు దయాకర్రెడ్డి, టీఆర్ఎస్ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి బేర బాలకిషన్, డివిజన్ అధ్యక్షుడు ఆకుల అరవింద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
మహేశ్వరంలో.. కరోనా కట్టడికి ప్రజలు సహకరించాలని మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. శుక్రవారం మహేశ్వరం మండల కేంద్రంలోని గడికోట జిల్లా పరిషత్ పాఠశాలలో సూపర్స్ప్రెడర్ వ్యాక్సినేషన్ను జిల్లాపరిషత్ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో ఫ్రంట్లైన్ వారియర్స్గా ఉన్న సుమారు వెయ్యి మంది జర్నలిస్టులకు టీకాలను వేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు.ఈ వ్యాక్సినేషన్లో భాగంగా రేషన్డీలర్లు, పెట్రోల్ పంపు సిబ్బంది, ఫర్టిలైజర్స్ ఇతర వీధివ్యాపారులకు టీకాలను వేస్తున్నామని ఆమె తెలిపారు. ఎంపీపీ రఘుమారెడ్డి, వైస్ఎంపీపీ సునీతా, సహకార బ్యాంక్ చైర్మన్ మంచెపాండు యాదవ్, వైస్ చైర్మన్ వెంకటేశ్వర్రెడ్డి, ఇన్చార్జి ఆర్డీవో రవికుమార్, ఎంపీడీవో నర్సింహులు, తహసీల్దార్ ఆర్పీజ్యోతి, సీఐ మధుసూదన్, డాక్టర్ సంధ్యారాణి, కోఆప్షన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.