బడంగ్పేట,మే19: ఇంటింటి జ్వర సర్వేతో సత్ఫలితాలు వస్తున్నాయని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ సూచనలను కేంద్రం అమలు చేస్తున్నదని చెప్పారు. బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని టెలిఫోన్కాలనీలో బుధవారం జ్వర సర్వేను పరిశీలించారు. ఆశ కార్యకర్తలతో మాట్లాడి వివరాలను అడిగి తెలుసుకున్నారు.సీఎం కేసీఆర్ రాష్ట్రంలో చేపట్టిన జ్వర సర్వేను కేంద్రం దేశవ్యాప్తంగా అమలు చేస్తున్నదని గుర్తు చేశారు. ప్రైవేట్కు దీటుగా ప్రభుత్వ దవాఖానలో సకల సదుపాయాలు ఉన్నాయన్నారు. మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి, డిప్యూటీ మేయర్ ఇబ్రాం శేఖర్, కమిషనర్ కృష్ణమోహన్రెడ్డి, డీఈ అశోక్రెడ్డి, కార్పొరేటర్లు భీమిడి స్వప్నా జంగారెడ్డి, అర్జున్, సుదర్శన్రెడ్డి, బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.