బడంగ్పేట,మే15: మీర్పేటలో ట్రంక్ లైన్ పనులు త్వరగా పూర్తి చేయాలని విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మీర్పేట మున్సిపల్ కార్యాలయంలో మంత్రి ప్రజా ప్రతినిధులు, అధికారులతో శనివారం సమీక్షా సమావేశం నిర్వహించా రు. మీర్పేట, బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలలో వర్షా లు రాకముందే ట్రంక్ లైన్ పను లు త్వరగా పూర్తి చేయాలన్నారు. మురుగు నీరు చెరువులలోకి రాకుండాచూడాలన్నారు.అధికారులు, కాంట్రాక్టర్లు సమన్వయంతో పనిచేసి పనులు పూర్తి చేయించాలన్నారు. ఈ కార్యక్రమంలో మీర్పేట మేయర్ దుర్గా దీప్లాల్ చౌహన్, బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ చిగిరింత పారిజాత, డిప్యూటీ మేయర్ తీగల విక్రంరెడ్డి, మీర్పేట టీఆర్ఎస్ అధ్యక్షురాలు లావాణ్య, బడంగ్పేట పార్టీ అధ్యక్షుడు రామిడి రాంరెడ్డి ఉన్నారు.
బాలాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మెడికల్ అధికారి డాక్టర్ శ్రీనివాస్, సిబ్బందితో మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి సమావేశం నిర్వహించారు. ఇంటింటి జ్వర సర్వే, వాక్సిన్, కొవిడ్ టెస్టుల వివరాలను మంత్రి అధికారులను అడిగి తెలుసుకున్నారు. కొవిడ్ పట్ల ప్రజలకు అవసరమైన సాయం చేయాలని వైద్యులకు సూచించారు. 106 బృందాలతో ఇంటింటి సర్వే చేయిస్తున్నట్లు అధికారులు మంత్రికి వివరించారు. అదేవిధంగా మందులు, కరోనా పరీక్షలు, వాక్సిన్ సమస్య రాకుండా చూసుకోవాలని ఆమె వైద్యులకు సూచించారు.