బడంగ్పేట,ఏప్రిల్30 : రాష్ట్రంలో ఎన్ని విపత్తులు వచ్చినా ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ఆపలేదని మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధి గుర్రంగూడ 6వ డివిజన్లోని బృందావన్ కాలనీలో రూ.14లక్షలతో వరద నీటి కాలువలకు, బాలాజీ హోమ్స్లో రూ.32లక్షలతో బీటీ రోడ్డు, కృష్ణా నగర్లో రూ.9లక్షలతో వరద నీటి కాలువలకు మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి, డిప్యూటీ మేయర్ ఇబ్రాం శేఖర్, కార్పొరేటర్లతో కలిసి మంత్రి శంకుస్థాపన చేశారు. వరదలో నష్ట పోయిన 7 గురికి చెక్కులను అందజేశారు. రూ.60లక్షల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..కరోనా విజృంభిస్తున్న తరుణంలో కూడా అభివృద్ధి పనులను చేస్తున్నామన్నారు. అభివృద్ధికి ఆటంకం లేకుండా కాలనీల్లో పనులు చేయిస్తున్నామన్నారు.
ప్రతి ఒక్కరూ కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. కాలనీల్లో కొవిడ్ పై అవగాహన కల్పించాలన్నారు. ఎలాంటి అపోహలకు తావు లేకుండా వ్యాక్సిన్ వేయించుకోవాలన్నారు. పారిశుధ్యం లోపించకుండా చర్యలు తీసుకుంటున్నామని ఆమె పేర్కొన్నారు. కరోనా తగ్గు ముఖం పట్టే వరకు అధికారులు, ప్రజా ప్రతినిధులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు గడ్డం లక్ష్మారెడ్డి, శంకర్, కోఆప్షన్ సభ్యులు జ్యోతి అశోక్, మాజీ ఎంపీపీ గుర్రం నర్సింహారెడ్డి, మాజీ కౌన్సిలర్ గుర్రం సాయి కిరణ్ రెడ్డి, అధికారులు వంకాయల యాదగిరి కాలనీ వాసులు ఉన్నారు.
వరదల కారణంగా ఇండ్లు కూలిపోయిన 50 మందికి విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి రూ.22.75 లక్షల చెక్కులను శుక్రవారం బడంగ్పేటలో బాధితులకు అందజేశారు. మంత్రి మాట్లాడుతూ జెల్పల్లి మున్సిపల్ పరిధిలో వరదల కారణంగా చాలా మందికి తీవ్ర నష్టం జరిగిందన్నారు. కార్యక్రమంలో మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి, జెల్పల్లి మున్సిపల్ చైర్మన్ అబ్దుల్లా సాదీ, తాసీల్దార్ డి శ్రీనివాస్రెడ్డి , కార్పొరేటర్ పి శ్రీనివాస్రెడ్డి,పెద్ద బావి సుదర్శన్రెడ్డి, మాజీ ఎంపీటసీ సంరెడ్డి వెంకట్రెడ్డి, కౌన్సిలర్లు,నాయకులు ఉన్నారు.
మహేశ్వరం/కందూకూరు, ఏప్రిల్ 30: అనారోగ్యం తో దవాఖానలో చికిత్సపొందిన బాధిత కుటుంబాలకు విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి శుక్రవారం సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు. మహేశ్వరం మండల పరిధిలోని అమీర్పేట గ్రామానికి చెందిన చాకలి అడివయ్యకు , కందుకూరు మండలం పులిమామిడి గ్రామానికి చెందిన సువర్ణకు చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో అమీర్పేట ఉపసర్పంచ్ పోతుల నర్సింగ్రావు పటేల్, టీఆర్ఎస్ బీసీ విభాగం అధ్యక్షుడు ఆనేగౌని దామోదర్గౌడ్ తదితరులు పాల్గొన్నారు. రాచులూరు గ్రామానికి చెందిన గుర్జని చంద్రయ్యకు జాపాల వీరేశ్కు, మీగడి ప్రవళికకు సీఎం రిలీఫ్ ఫండ్ మంజూరు కాగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశాల మేరకు జడ్పీటీసీ బొక్క జంగారెడ్డి బాధితులకు అందజేశారు.