బడంగ్పేట, ఏప్రిల్14: అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఉందని మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మీర్పేట, జిల్లెలగూలో స్థానిక మేయర్ దుర్గా దీప్లాల్చౌహన్, కార్పొరేటర్లు, ఉత్సవ కమిటీ సభ్యులతో కలిసి మంత్రి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గడిచిన ఆరేండ్ల కాలంలో 605 మంది దళిత విద్యార్థులను విదేశాలలో చదివిస్తున్నట్లు తెలిపారు. వారి చదువుల కోసం రూ.207 కోట్లు ఖర్చు, కార్పొరేట్ విద్యను అందించడానికి 260 గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి దళిత బిడ్డకు మంచి విద్యను అందించాలన్న లక్ష్యంతో సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారన్నారు. అణగారిన వర్గాల కోసం ఆయన చేసిన కృషి ఎనలేనిదన్నారు. అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయవలసిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో మేయర్ దుర్గా దీప్లాల్ చౌహన్, కార్పొరేటర్లు, అంబేద్కర్ ఉత్సవ కమిటీ సభ్యులు, దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు.