బడంగ్పేట, అక్టోబర్ 26 : ప్రజలకు మెరుగైన వైద్య సౌకర్యాలు కల్పించడానికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మంగళవారం మీర్పేట పురపాలక మున్సిపల్ పరిధిలోని జిల్లెల్గూడ, కమలా నెహ్రూనగర్లో అర్బన్ హెల్త్ సెంటర్ ఏర్పాటుకు ఆమె ఎమ్మెల్సీ వాణీదేవితో కలిసి శం కుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కరోన కష్టకాలంలో సీఎం కేసీఆర్ ఒకవైపు కరోనా బాధితులను కాపాడే ప్రయత్నం చేస్తూనే మరో వైపు వైద్య సౌకర్యాలు మెరుగుపరిచే విధంగా కృషి చేస్తున్నారన్నారు. ప్రతి జిల్లాకు ఒకటి చొప్పున మెడికల్ కాలేజీ ఏర్పాటు దిశగా అడుగులు పడుతున్నాయన్నారు. మారుమూల ప్రాంతాల నుంచి హైదరాబాద్కు వైద్య నిమిత్తం వచ్చేవారు ఉస్మానియా, గాంధీ దవాఖాన లు మాత్రమే గుర్తుకు వస్తాయన్నారు. రూ. 1200 కోట్లతో వరంగల్లో అన్ని హంగులతో ప్రభుత్వ దవాఖానను ని ర్మించబోతున్నారన్నారు. గచ్చిబౌలిలో ఏర్పాటు చేసిన టి మ్స్తో పాటు సనత్నగర్, గడ్డిఅన్నారం, ఉప్పల్లో ప్ర భుత్వ దవాఖానల ఏర్పాటు చేయనున్నారని తెలిపారు.
మీర్పేట, బడంగ్పేట, బండ్లగూడలో బస్తీ దవాఖానలు త్వరలో ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. టీఆర్ఎస్ పార్టీ ఏర్పడి 20 ఏండ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సంక్షేమానికి కృషి చేస్తున్న సీఎం కేసీఆర్ను దీవించాన్నారు. ఎమ్మెల్సీ వాణీదేవి మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ఆధ్యర్యంలో రాష్ర్టాన్ని సాధించిన సీఎం కేసీఆర్ ప్రభుత్వం ఎప్పటికీ ఉండాలని, మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి, మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ దుర్గా దీప్లాల్ చౌహాన్, డిఫ్యూటీ మేయర్ తీగల విక్రంరెడ్డి, జిల్లా డీఎంహెచ్వో స్వరాజ్యలక్ష్మి, డిఫ్యూటీ డీఎంహెచ్వో వినోద్ కుమార్, మెడికల్ ఆఫీసర్ ఎం. శ్రీనివాస్, పద్మశ్రీ, సూపర్ వైజర్ శ్రీనివాస్, కమల, సీనియర్ అసిస్టెంట్ సంజయ్ నాయక్ , కార్పొరేటర్లు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.