కలెక్టరేట్, జూలై 30 : జవహర్నగర్ డంపింగ్ యార్డు నుంచి కాలనీల్లోకి మురుగునీరు రాకుండా ఉండేందుకు స్టార్మ్ డ్రైన్ పైపులైన్ ఏర్పాటు చేయాలని కోరుతూ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్కు రాష్ట్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి ఆధ్వర్యంలో దమ్మాయిగూడ మున్సిపల్ చైర్పర్సన్ వసుపతి ప్రణీత వినతిపత్రం అందజేశారు. వర్షాకాలంలో డంపింగ్ యార్డు నుంచి వచ్చే మురుగు నీటితో దమ్మాయిగూడలోని పలు కాలనీల ప్రజలకు ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని తెలిపారు. దమ్మాయి చెరువు నుంచి నాసిక్ చెరువు వరకు స్టార్మ్ డ్రైన్ పైపులైన్ (1200 ఎంఎం) నిర్మాణానికి రూ. 6 కోట్లు మంజూరు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జవహర్నగర్ మేయర్ కావ్య, డిప్యూటీ మేయర్ శ్రీనివాస్గుప్తా, కౌన్సిలర్ వసుపతి రమేశ్గౌడ్, నాయకులు వసుపతి శ్రీకాంత్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.