శ్రీనగర్కాలనీ, జూన్ 15 : కరోనా కట్టడికి ప్రతి ఒక్కరూ సహకరించాలని, పోలీస్ సిబ్బంది కర్ఫ్యూను కఠినంగా అమలు చేయాలని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ అన్నారు. మంగళవారం బంజారాహిల్స్లోని సుల్తాన్ ఉలూమ్ ఎడ్యుకేషన్ సొసైటీ ప్రాంగణంలో మెగా ఇంజినీరింగ్, రెయిన్బో దవాఖాన సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని హోంమంత్రి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కొవిడ్ కట్టడికి చేపట్టిన చర్యలు ఇతర రాష్ర్టాలకు మార్గదర్శకంగా నిలిచాయన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు దానం నాగేందర్, మాగంటి గోపినాథ్, నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్, డీసీపీ ఏఆర్ శ్రీనివాస్, పోలీస్ ఉన్నతాధికారులు శిఖాగోయల్, నిర్మల, ఎడ్యూకేషన్ సొసైటీ చైర్మన్ మహ్మద్ వల్లీవుల్లా, మెగా ఇంజినీరింగ్ లిమిటెడ్ ఎండీ పీవీ కృష్ణారెడ్డి, కంచర్ల రమేశ్, బంజారాహిల్స్, పంజాగుట్ట సీఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.