బండ్లగూడలో నూతనంగా నిర్మించిన చాంద్రాయణగుట్ట కొత్త పోలీస్స్టేషన్ను శనివారం హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, డీజీపీ మహేందర్రెడ్డిలతో కలిసి హోంమంత్రి మహామూద్ అలీ ప్రారంభించారు. స్టేషన్ లోపల పలు విభాగాలను ప్రారంభించారు. డీజీపీ మహేందర్రెడ్డి, ఎంపీ అసదుద్దీన్తో కలిసి మొక్కలు నాటా రు. కార్యక్రమంలో నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్, ఎమ్మెల్సీ సురభి వాణీదేవి, హసన్ జాఫ్రీ, అదనపు కమిషనర్లు అనిల్ కుమార్, డీ.ఎస్.చౌహన్, పోలీస్ హౌసింగ్ బోర్డు ఇన్చార్జి ఆర్.రాజేశ్వరీ, సౌత్ జోన్ డీసీపీ గజరావు భూపాల్, అదనపు డీసీపీ సయ్యద్ రఫీక్, ఫలక్నుమా ఏసీపీ మహ్మద్ మజీద్, చాంద్రాయణగుట్ట ఇన్స్పెక్టర్ ప్రసాద్ వర్మ, అదనపు ఇన్స్పెక్టర్ ఎస్.వీరయ్యతో పాటు పలువురు పోలీసులు పాల్గొన్నారు. – చాంద్రాయణగుట్ట, జూలై 24;