నాలా ప్రహరీ నిర్మాణానికి రూ. 68 కోట్లు

అంబర్పేట : అంబర్పేట నియోజకవర్గ అభివృద్ధిపై రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ శనివారం సమీక్ష నిర్వహించారు. ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్, మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అర్వింద్కుమార్, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్, జలమండలి ఎండీ దానకిశోర్, ఇతర ప్రభుత్వ విభాగాల ఉన్నతాధికారులతో ప్రగతిభవన్లో చర్చించారు. సమీక్ష వివరాలను ఎమ్మెల్యే వెల్లడించారు. పెండింగ్లో ఉన్న రత్నానగర్ నాలా ప్రహరీ నిర్మాణానికి రూ.68 కోట్లు మంజూరు చేస్తున్నట్లు మంత్రి కేటీఆర్ చెప్పారన్నారు. అంబర్పేట ఛే నంబర్ ఫ్లైఓవర్ పనులను వెంటనే ప్రారంభించాలని, అవసరమైన డ్రైనేజీ, తాగునీటి పైప్లైన్లను మరోచోటికి మార్చాలని అధికారులను ఆదేశించారు.
నియోజకవర్గంలో 8 జంక్షన్ల అభివృద్ధి, ఫుట్పాత్ల ఆధునికీకరణ, ఏసీ బస్బేలు, ఓపెన్ జిమ్ల ఏర్పాటుకు కూడా అంగీకరించారన్నారు. ఛే నంబర్లో రూ.15 కోట్లతో బాక్స్ డ్రెయిన్ నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తామని మంత్రి తెలిపారన్నారు. గ్రేవ్ యార్డులను అభివృద్ధి చేయాలని, మూసారాంబాగ్ బ్రిడ్జి కాజ్వే స్థానంలో పెద్ద బ్రిడ్జి నిర్మించాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. అంబర్పేట సబ్ డివిజన్ పరిధిలోని అడిక్మెట్ సెక్షన్లో నిరంతర తాగునీటి సరఫరాకు పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసుకొని అందుకు చర్యలు తీసుకోవాలని జలమండలి అధికారులకు ఆదేశాలు ఇచ్చారని ఎమ్మెల్యే వివరించారు.
తాజావార్తలు
- కరోనా ప్రభావం ఇప్పట్లో తగ్గదు: ప్రపంచ ఆరోగ్యసంస్థ
- కిడ్నాప్ అయిన 317 మంది బాలికలు రిలీజ్
- పవన్ నాలుగో భార్యగా ఉంటాను : జూనియర్ సమంత
- ఇన్సూరెన్స్ సంస్థలకు ఐఆర్డీఏ న్యూ గైడ్లైన్స్
- పెట్రోల్, డీజిల్పై పన్నులు తగ్గించే యోచనలో ఆర్థిక శాఖ
- ప్రపంచ కుబేరుల జాబితా : రూ 6.09 లక్షల కోట్లతో 8వ స్ధానంలో ముఖేష్ అంబానీ!
- ఆజాద్ దిష్టిబొమ్మ దగ్దం చేసిన కాంగ్రెస్ వర్కర్లు
- ధానాపూర్ ఎక్స్ప్రెస్కు తృటిలో తప్పిన ప్రమాదం
- స్టన్నింగ్ లుక్లో నాగార్జున.. పిక్ వైరల్
- ఆస్ట్రేలియాలో బస్డ్రైవర్గా మారిన శ్రీలంక క్రికెటర్