తెలుగుయూనివర్సిటీ, అక్టోబర్ 21: ప్రఖ్యాత ఖాదిర్ అలీ బేగ్ థియేటర్ ఫెస్టివల్కు చారిత్రక వారసత్వ సంపద కలిగిన హైదరాబాద్ నగరం వేదికైంది. మొజంజాహి మార్కెట్ ప్రాంగణంలో ఈ నెల 24వరకు కొనసాగనున్న ఈ థియేటర్ ఫెస్టివల్ను రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు గురువారం లాంఛనంగా ప్రారంభించారు. థియేటర్ ఫెస్టివల్ బ్రోచర్ ఆవిష్కరణ అనంతరం మంత్రి మాట్లాడుతూ ఘన చరిత్ర కలిగిన మొజంజాహి మార్కెట్ ప్రాంగణంలో ఇలాంటి నాటక ప్రదర్శన జరగడం రాష్ర్టానికే గర్వకారణమన్నారు. ప్రఖ్యాత రచయిత రాజ్ జోసెఫ్ రచించిన గార్డ్స్ ఎట్ ది తాజ్ నాటకానికి శశిర్ సింగ్ చౌహాన్ దర్శత్వం వహించగా కళాకారులు అత్యద్భుతంగా నటించి ఆహూతుల ప్రశంసలు అందుకున్నారు. కార్యక్రమంలో ఐఏఎస్ అధికారులు అర్వింద్కుమార్, జయేశ్ రంజన్, జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.