లండన్, జూన్ 13: తాము ప్రాతినిధ్యం వహిస్తున్న దేశాల మధ్య మైత్రికి చిహ్నంగా జీ-7 సదస్సు సందర్భంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్కు సుమారు 4.4 లక్షల (6 వేల డాలర్లు) విలువైన సైకిల్ను బహుమతిగా ఇచ్చారు. యంత్రాలను వాడకుండా కేవలం చేతి పని నైపుణ్యంతోనే దీన్ని తయారు చేయడం విశేషం. మరోవైపు బోరిస్ జాన్సన్ 19వ శతాబ్దంలో బానిసత్వానికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్న వ్యక్తి ఫొటోను బైడెన్కు బహూకరించారు.