కరీంనగర్ : మొన్న ఎంపీటీసీలు, నేడు సర్పంచ్లు.. ఈటల రాజేందర్కు షాకిచ్చారు. ఈటలకు మద్దతు ప్రకటించే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. ఈటలవి స్వార్థపూరిత రాజకీయాలు అని మండిపడ్డారు. రాష్ర్ట ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటే తామంతా ఉంటామని కమలాపూర్ మండల సర్పంచ్లు స్పష్టం చేశారు. ప్రజా సంక్షేమం కోసం అహర్నిశలు కష్టపడుతున్న మహనీయుడు సీఎం కేసీఆర్ అని వారు తెలిపారు. ప్రజల కష్టాలు తెలిసిన కేసీఆర్ వెంటే తామంతా ఉంటామని, కమలాపూర్ మండలంలో పార్టీ బలోపేతానికి తమవంతు కృషి చేస్తామని సర్పంచులు తేల్చిచెప్పారు.
ఈటల రాజేందర్ బర్తరఫ్తో తమకు నిజమైన స్వాతంత్ర్యం వచ్చిందన్నారు. ఎవరెన్ని భయభ్రాంతులకు గురిచేసినా భయపడే ప్రసక్తే లేదని పేర్కొన్నారు. సొంత లాభం కోసం పార్టీకి ద్రోహం చేసేవారికి తగిన బుద్ధి చెప్తామని సర్పంచులు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు లడే గోపాల్, పింగళి రవళి రంజిత్ రెడ్డి, కంచరకుంట్ల విజేందర్ రెడ్డి, ఇనుగాల కిరణ్మయి విజయ్ కుమార్, దొంగల తిరుపతమ్మ శ్రీనివాస్, ఈ దేవేందర్ రావు, ముజీబ్ హుస్సేన్, శ్రీధర్ రావుతో పాటు ఇతరులు పాల్గొన్నారు.