రామగిరి, మే 21: కరోనా బాధితులకు అన్ని విధాలా అండగా ఉంటామని నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి అన్నారు. నల్లగొండ పట్టణం సాగర్ రోడ్డులోని డాన్బాస్కో అకాడమీలో కొవిడ్ రోగుల కోసం ఏర్పాటు చేసిన ఐసొలేషన్ సెంటర్ను శుక్రవారం ఆయన ప్రారంభించారు. అందులో వసతులు, ఇతర వివరాలను తెలుసుకుని పలు సూచనలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కొవిడ్ బాధితులకు ఇంటి వద్ద ఇబ్బందులుంటే ఐసొలేషన్లో చేరాలన్నారు. ధైర్యంగా ఉంటే కరోనాను జయించవచ్చని సూచించారు. ప్రైవేట్కు దీటుగా ప్రభుత్వ దవాఖానల్లో అన్ని వసతులతో కూడిన కొవిడ్ చికిత్స అందిస్తున్నారని తెలిపారు. నల్లగొండ పట్టణంలోని 7, 8, 9, 10, 11, 25 వార్డులకు చెందిన కరోనా బాధితులు ఐసొలేషన్ కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని కౌన్సిలర్, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు పిల్లి రామరాజు సూచించారు. ఐసొలేషన్ సెంటర్లో చేరిన వారికి పాలు, పండ్లు, గుడ్డుతో భోజన వసతి కల్పిస్తున్నామని చెప్పారు. వివరాలకు కౌన్సిలర్లు పిల్లి రామరాజు (9440252962), ఆంగోతు ప్రదీప్నాయక్ (9885639688), కంకణాల లక్ష్మమ్మ (9848599425), మారగోని భవానీ (9703333380), జూలకంటి ధనలక్ష్మి (9849689260), ఆర్ఎంపీ అంజిబాబు (9985601554)లను సంప్రదించవచ్చని వెల్లడించారు. కార్యక్రమంలో డీఎస్పీ వెంకటేశ్వర్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేశ్గౌడ్, మాజీ కౌన్సిలర్ రావుల శ్రీనివాస్రెడ్డి, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.