కడ్తాల్, జూన్ 10 : రెండేళ్లలో కల్వకుర్తి నియోజకవర్గంలోని ప్రతి ఎకరాకు సాగునీటిని అందజేసేందుకు కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. గురువారం సాయంత్రం మండల కేంద్రంలోని వరి కొనుగోలు కేంద్రం, పల్లెప్రకృతి వనాన్ని జడ్పీటీసీ దశరథ్నాయక్, డీసీసీబీ డైరెక్టర్ వెంకటేశ్గుప్తా, సర్పంచ్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీనర్సింహారెడ్డితో కలిసి ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ యేడు అంచనాలకు మించి వరి సాగు జరిగిందన్నారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్ట్లు పూర్తి కావడంతో వరి సాగు భారీగా పెరిగిందన్నారు. రాబోయే రోజుల్లో కేఎల్ఐ, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాల ద్వారా నియోజకవర్గంలోని 2 లక్షల ఎకరాలకు సాగునీటిని అందిజేస్తామని చెప్పారు.
పల్లెప్రకృతి వనాలతో కొత్త శోభ…
పల్లెప్రకృతి వనాలతో గ్రామాలన్నీ నూతన శోభను సంతరించుకున్నాయని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. మండల కేంద్రంలోని పల్లెప్రకృతి వనాన్ని ఆయన పరిశీలించారు. పల్లెప్రకృతి వనం చాలా ఆహ్లాదకరంగా ఉందన్నారు. పల్లెప్రకృతి వనాన్ని సుందరంగా ఏర్పాటు చేసిన సర్పంచ్ లక్ష్మీనర్సింహారెడ్డిని ఎమ్మెల్యే అభినందించారు. ఎమ్మెల్యే వెంట తహసీల్దార్ మహేందర్రెడ్డి, డీసీవో ధాత్రిదేవి, అసిస్టెంట్ రిజిస్ట్రర్ శారద, ఏవో శ్రీలత, ఎస్సై సుందరయ్య, పీఏసీఎస్ వైస్ చైర్మన్ సత్యం, రైతుబంధు సమితి మండల కన్వీనర్ వీరయ్య, సర్పంచ్లు ఉన్నారు.
కొనుగోలులో వేగం పెంచండి
ఆమనగల్లు, కడ్తాల్, తలకొండపల్లి, మాడ్గుల మండలాల్లో వరిధాన్యం కొనుగోలుపై సంబంధిత అధికారులతో ఎమ్మెల్యే జైపాల్యాదవ్ సమీక్ష నిర్వహించారు. సమీక్షల్లో ఆయా కొనుగోలు కేంద్రాల్లో సేకరించిన ధాన్యం, నిలువ కోసం గోదాంలు, కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఏర్పాటు చేసిన సౌకర్యాలు, ఆయా మండలాల్లో అదనంగా రైతుల నుంచి కొనుగోలు చేసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఆమనగల్లు, కడ్తాల్, తలకొండపల్లి మండలాల్లో ఇప్పటివరకు రికార్డు స్థాయిలో 3లక్షలకు పైగా బస్తాల ధాన్యం కొనుగోలు చేసినట్లు చెప్పారు. ధాన్యం నిల్వచేసేందుకు ఇబ్బందులు తలెత్తడంతో కలెక్టర్కు సూచనలు చేసి తలకొండపల్లి, ఆమనగల్లు మండలాల్లో ఉన్న జిన్నింగ్ మిల్లులో నిల్వచేసేందుకు ఏర్పాటుకు చర్యలు తీసుకున్నామన్నారు. వానకాలం ప్రారంభం అవుతుండటంతో అధికారులు వేగం పెంచి ధాన్యం కొనుగోలు చేయాలన్నారు.
సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ..
ఆమనగల్లు మండలంలోని సీతారాంనగర్ తండాకు చెందిన తిరుపతికి రూ.17వేలు, పెంటమ్మకు రూ.22 వేలు, జంగారెడ్డిపల్లికి చెందిన చెన్నయ్యకు రూ. 51 వేలు, మంగళపల్లికి చెందిన అండాలుకు రూ.45వేలు, సీతారాంనగర్ తండాకు చెందిన చందనకు రూ.16వేలు, కృష్ణకు రూ.16వేల చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో డీసీవో ధాత్రీదేవి, ఫీల్డ్ అధికారి శారద, సింగిల్ విండో చైర్మన్ గంప వెంకటేశ్, రైతుబంధు సమితి మండల కోఆర్డినేటర్లు అర్జున్రావు, జోగు వీరయ్య, వైస్ ఎంపీపీ అనంతరెడ్డి పాల్గొన్నారు.
విద్యార్థులకు స్టడీ మెటీరియల్ అందజేత
ఆమనగల్లు పట్టణంలోని కల్యాణిగార్డెన్ ఆవరణలో నిరుద్యోగ యువతకు స్టడీ మెటీరియల్ పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే జైపాల్యాదవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కల్వకుర్తి నియోజకవర్గంలో నిరుద్యోగ యువతకు పోటీ పరీక్షలకు శిక్షణ కోసం ఆమనగల్లు, కల్వకుర్తి ప్రధాన కేంద్రాల్లో ఏర్పాటు చేసిన కోచింగ్ సెంటర్లకు మంచి స్పందన వచ్చిందన్నారు. రెండు మున్సిపాలిటీలు, ఏడు మండలాల నుంచి 1200 మంది విద్యార్థులు ఉచిత కోచింగ్ తీసుకున్నారన్నారు. యువత నిరంతరం సాధన చేస్తూ ఉద్యోగాలు సాధించాలన్నారు. కోచింగ్ సెంటర్లో శిక్షణ పొందిన విద్యార్థులకు స్టడీ మెటీరియల్ను అందజేశారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ అనంతరెడ్డి, రైతుబంధు సమితి మండల కోఆర్డినేటర్ అర్జున్రావు, జోగు వీరయ్య, సింగిల్ విండో చైర్మన్ వెంకటేశ్, సీఐ ఉపేందర్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పాల్గొన్నారు.