మౌలాలి ఈస్ట్ మారుతీనగర్కు చెందిన నిశాంత్కు ప్రమాద వశాత్తు విద్యుత్ షాక్ తగిలి తీవ్ర గాయాల పాలైన విషయం విధితమే. ప్రమాద విషయం తెలుసుకున్న మంత్రి కేటీఆర్ వెంటనే స్పందించారు. ‘నిశాంత్కు మెరుగైన వైద్యం అందజేయాలి. ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి. ఏ అవసరం ఉన్నా నన్ను సంప్రదించాలి’ అని మంత్రి కేటీఆర్ ట్విట్టర్లో కుటుంబ సభ్యులకు సూచించారు. దీంతో బాలుడు నిశాంత్ కుంటుంబ సభ్యులు మంత్రి కేటీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు.
నియోకవర్గంలోని అన్ని ట్రాన్స్ఫార్మర్ల చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని విద్యుత్ శాఖ అధికారులకు ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు ఆదేశాలు జారీ చేశారు. ఫెన్సింగ్ ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని, అందుకు అవసరమైన నిధులు మంజూరు చేయిస్తామని తెలిపారు.
‘విద్యుత్ షాక్కు గురై దవాఖానలో చికిత్స పొందుతున్న బాలుడి వైద్య ఖర్చులు నేనే భరిస్తా.., ఈ విషయాన్ని మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకుపోతా..’ అని ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. అయితే ఏఎస్రావునగర్లోని అంకూర్ దవాఖానలో చికిత్స పొందుతున్న బాలుడు నిశాంత్ని ఆదివారం మైనంపల్లి పరామర్శించి కుటుంబ సభ్యులకు భరోసా కల్పించారు. పూర్తి వైద్య ఖర్చులు ఇస్తానని మీరు ఒక్క పైసా చెల్లించాల్సిన అవసరం లేదని బాలుడి కుటుంబసభ్యులకు హామీ ఇచ్చారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. ఈ విషయాన్ని మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకువెళ్లి బాలుడి కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని తెలిపారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ గున్నాల చంద్రశేఖర్యాదవ్ రూ.10వేలు, టీఆర్ఎస్ నాయకుడు అమీనుద్దీన్ రూ.10వేలు అందజేశారు. ఎమ్మెల్యే వెంట కార్పొరేటర్ ప్రేమ్కుమార్, గుండా నిరంజన్, గున్నాల చంద్రశేఖర్, పద్మజారెడ్డి, హరీశ్రెడ్డి తదితరులు ఉన్నారు.