చార్మినార్, జూన్ 14 : మంత్రి కేటీఆర్ మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు. ఓ కొవిడ్ రోగికి ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ను అందించి…అండగా నిలిచారు. లాల్దర్వాజా పంచముఖి హనుమాన్ దేవాలయం ప్రాంతానికి చెందిన సునీత (50) ఇటీవల కరోనా సోకడంతో కింగ్కోఠి వైద్యశాలలో చికిత్స పొందారు. పదిరోజుల అనంతరం ఆరోగ్య పరిస్థితి మెరుగు కావడంతో వైద్యులు ఆమెను డిశ్చార్జి చేశారు. కొన్ని రోజుల పాటు ఇంటి వద్ద ఆక్సిజన్ అందించే ఏర్పాట్లు చేసుకోవాలంటూ.. కుటుంబసభ్యులకు సూచించారు. నిత్యం ఇతర ప్రాంతాల నుంచి ఆక్సిజన్ సిలిండర్లను సేకరించడం.. సమయానికి లభించక తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది. దీంతో సునీత కుటుంబసభ్యులు ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ కావాలంటూ.. ఆదివారం అర్ధరాత్రి మంత్రి కేటీఆర్కు ట్వీట్ చేశారు. స్పందించిన మంత్రి తెల్లవారుజాము కల్లా అందుకుంటారని భరోసా ఇవ్వగా, మంత్రి కార్యాలయ సిబ్బంది సునీత కుటుంబసభ్యులకు ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ను అందజేశారు. గొప్ప మనసుచాటుకున్న మంత్రి కేటీఆర్కు సునీత కుటుంబసభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.