సుల్తాన్ బజార్/అబిడ్స్, జూలై 16: ప్రతి యేడాది తరహాలోనే ఈ సంవత్సరం కూడా యూసుఫెయిన్ బాబా దర్గా ఉర్సు ఉత్సవాలలో భాగంగా సందల్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్న ట్లు రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ మహ్మద్ సలీం పేర్కొన్నారు. ఈ మేర కు శుక్రవారం నాంపల్లి యూసుఫెయి న్ బాబా దర్గాలో చాదర్ను సమర్పించి ప్రత్యేక ప్రార్ధనలను నిర్వహించిన అనంతరం, ఆయన దర్గా నుంచి మక్కా మజీదు వరకు వెళ్ళే వాహనాన్ని ప్రారంభించారు.
యూసుఫెయిన్ దర్గా ఉర్సు ఉత్సవాలలో రాష్ట్ర మైనార్టీ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ దర్గాలో చాదర్ను సమర్పించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. సాండల్ను పురస్కరించుకుని శుక్రవారం రాత్రి దర్గాకు విచ్చేసి ప్రార్థనలు నిర్వహించారు.