రైతు కుటుంబం నుంచి వైస్ చాన్సలర్ స్థాయికి ఎదిగిన కిషన్రావు
గతంలో ఇదే ఊరినుంచి ఓయూ వీసీగా పనిచేసిన నవనీతరావు
ఆనందం వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు
ఎల్కతుర్తి, మే 23 : పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయ వైస్ చాన్సలర్గా బాధ్యతలు చేపట్టిన ప్రొఫెసర్ తంగెడ కిషన్రావుది ఎల్కతుర్తి మండలంలోని జీల్గుల. ఇదే గ్రామానికి చెందిన తంగెడ నవనీతరావు గతంలో ఉస్మానియా యూనివర్సిటీ వైస్చాన్సలర్గా పని చేశారు. నవనీతరావు కిషన్రావుకు సమీప బంధువు. ఒకే గ్రామం నుంచి ఇద్దరు వైస్చాన్సలర్లు ఎంపికవడంతో గ్రామస్తులు, విద్యాభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన ప్రొఫెసర్ కిషన్రావు అంచెలంచెలుగా వైస్చాన్సలర్ స్థాయికి ఎదిగా రు. జీల్గులకు చెందిన తంగెడ మనోహర్రావు-లక్ష్మీదేవిల కు మారుడు కిషన్రావు. 1-5వ తరగతి వరకు జీల్గుల ప్రభుత్వ పాఠశాలలో, హుజూరాబాద్ జడ్పీహెచ్ఎస్లో 6వ తరగతి, 7నుంచి 11వ వరకు వరంగల్ మహబూబి యా ఉన్నత పాఠశాల, పీయూసీ నుంచి డిగ్రీ వరకు జమ్మికుంటలోని ఆదర్శ డిగ్రీ కళాశాల (1966-70), తర్వాత ఉస్మానియాలో ఎంఏ తెలుగు (1971-73) అభ్యసించారు.
ఉద్యోగ బాధ్యతల్లో భాగంగా భువనగిరి శ్రీలక్ష్మీనర్సింహాస్వామి కళాశాలలో పది సంవత్సరాలు తెలుగు లెక్చరర్గా పనిచేశారు. అనంతరం ఉస్మానియా యూనివర్సిటీలో అకడమిక్ ఆడిట్ సెల్లో డిప్యూటీ డైరెక్టర్గా (1984-91)ఏడు సంవత్సరాలు, ఉస్మానియాలో తెలుగు డిపార్ట్మెంట్లో ప్రొఫెసర్గా (1991-2011) 21 సంవత్సరాలు, ఉస్మానియాలోనే తెలుగు డిపార్ట్మెంట్లో పాఠ్యప్రణాళికా సంఘం అధ్యక్షుడిగా 2 సంవత్సరాలు (2006-08), తెలుగు శాఖలో అధ్యక్షుడిగా (హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్) 2 సంవత్సరాలు విధులు నిర్వర్తించారు. అనంతరం ఉద్యోగ విరమణ పొందా రు. ప్రస్తుతం కిషన్రావు సేవలను తెలుగు విద్యాభివృద్ధికి వినియోగించుకునేందుకుగాను ప్రభుత్వం విశ్వవిద్యాలయ వైస్ చాన్సలర్గా నియమించింది. కాగా ప్రొఫెసర్ కిషన్రావుకు భార్య కరుణాదేవి, కుమారుడు, కూతురు ఉన్నారు. కరుణాదేవి సైతం ఉన్నత విద్యను అభ్యసించిన వారే. కిషన్రా వు ఇద్దరు పిల్లలు అమెరికాలో స్థిరపడ్డారు.