మెహిదీపట్నం : రాజకీయ నాయకుడిగా ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యలను పరిష్కరిస్తుంటాడు.. ఎవరికి ఏ ఆపదా వచ్చినా క్షణాల్లో అక్కడికి వెళ్లి విషయం తెలుసుకుని వారికి అండగా ఉంటాడు.. అన్ని తానై ముందు ఉంటాడు.. ఇలా ప్రజా సేవ చేస్తూనే.. మల్లేపల్లిలో నూతనంగా షాపును ఏర్పాటు చేశా డు.. షాపును ప్రారంభించిన కొన్ని నిమిషాలకే గుండెపోటుతో ఒక్కసారిగా కుప్పకూలా డు.. దవాఖానకు తీసుకెళ్లే క్రమంలో మృతి చెందాడు. ఈ ఘటన శనివారం రాత్రి మల్లేపల్లిలో చోటుచేసుకున్నది. వివరాల్లోకి వెళితే… ఎంఐఎం నేత మహ్మద్ అంజద్(50) మల్లేపల్లిలో జంజంలస్సీ పేరుతో షాపును ఏర్పాటు చేశాడు. శనివారం రాత్రి దాన్ని నాంపల్లి ఎమ్మెల్యే జాఫర్మెరాజ్ హుస్సేన్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే.. మహ్మద్ అంజద్తో పలు అంశాలను చర్చించి.. లస్సీ వ్యాపారం బాగా జరగాలని ఆకాంక్షించారు.. ఎమ్మెల్యే వెళ్లిన కొన్ని నిముషాల్లోనే మహ్మద్ అంజద్ గుండెపోటుతో హోటల్లోనే కుప్పకూలిపోయాడు. స్థానికులు ఆస్పత్రికి తీసుకువెళ్లేలోపే కన్నుమూశాడు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే జాఫర్మెరాజ్ హుస్సేన్ హుటాహుటిన అక్కడికి చేరుకుని అంజద్ మృతితో తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆదివారం మల్లేపల్లి బడీమసీదులో ప్రత్యేక ప్రార్థనల అనంతరం బజార్ఘాట్ ఏ బ్యాటరీ లైన్ స్మశాన వాటికలో అంజద్కు అంత్యక్రియలు నిర్వహించా రు.
అతడి మృతితో మల్లేపల్లి, రెడ్హిల్స్ డివిజన్లలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఎంఐఎం పార్టీలో క్రియాశీలకంగా పని చేస్తున్న మహ్మద్ అంజద్ మృతి పార్టీకి, ప్రజలకు తీరని లోటని నాంపల్లి,కార్వాన్ ఎమ్మెల్యేలు జాఫర్మెరాజ్ హుస్సేన్, కౌసర్మొయినుద్దీన్లు అని.. అతడి కుటుం బ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు.