కాచిగూడ,సెప్టెంబర్ 2 : గుర్తు తెలియని దుండగులు షటర్ తీసి నగదు, పాల ప్యాకెట్లను తస్కరించిన సంఘటన కాచిగూడ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ యాదేందర్ తెలిపిన వివరాల ప్రకారం బోడుప్పల్, మాన్యానగర్ ప్రాంతానికి చెందిన రాములు కుమారుడు రాజబోయిన మధుయాదవ్(30) వృత్తి రీత్యా నల్లకుంట డివిజన్ గోల్నాకలో శ్రీ గణేష్ మిల్క్షాపు నడిపిస్తున్నాడు.
బుధవారం రాత్రి 1 గంటకు మధు యాదవ్ తాళం వేయకుండా షటర్వేసి వెళ్లి మళ్లి 3 గంటల ప్రాంతంలో వచ్చేసరికి 25 లీటర్ల పాల ప్యాకెట్లు, రూ.80 వేల రూపాయలు కన్పించలేదు. ఆదే ఆదునుగా భావించిన గుర్తుతెలియని దుండగులు షటర్ తీసి అందులోకి ప్రవేశించి పాల ప్యాకెట్లు, నగదును దొంగిలించుకుని వెళ్లిపోయారు.
గురువారం షాపు నిర్వహాకుడు మధుయాదవ్ కాచిగూడ పోలీసులకు పిర్యాదు చేశాడు. ఘటన స్థలానికి చేరుకున్న కాచిగూడ పోలీసులు, క్లూస్టీం వివారాలను సేకరించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్సై వి.లక్ష్మయ్య తెలిపారు. నిందితులను త్వరలో పట్టుకుంటామని డీఎస్సై తెలిపారు.