సిటీబ్యూరో, మే 30 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ప్రభుత్వం లాక్డౌన్ను పొడిగించిన నేపథ్యంలో మెట్రో రైళ్ల వేళలను పొడిగించి నడుపుతామని మెట్రో అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఉదయం 7 గంటల నుంచి ఉదయం 9.45 వరకు నడుస్తున్న రైళ్లు నడుస్తున్నాయని, లాక్డౌన్ సడలింపు సమయం పెంచిన నేపథ్యంలో సోమవారం నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు నడిపిస్తామని వెల్లడించారు. ఒంటి గంట నుంచి 2 గంటల మధ్య సైతం ప్రజలు తమ గమ్యస్థానాలకు చేరుకునేందుకు సమయం ఇవ్వడంతో ఆ టైంలోనూ రైళ్లను నడిపేందుకు కార్యాచరణను సిద్ధం చేస్తామన్నారు. ముఖ్యంగా మొదటి రైలు, చివరి రైలు గమ్య స్థానాలకు చేరుకునే సమయాన్ని లాక్డౌన్ నిబంధనలకు అనుగుణంగా నిర్ణయించి నడుపుతామన్నారు.