మణికొండ : ఈనెల 21న పశుసంక్రాంతి జాతర నిర్వహిస్తున్న నేపథ్యంలో దేశ నలుమూలల నుంచి వచ్చే పాల ఉత్పత్తి, పశువ్యాపారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తుకుండా అవసరమైన ఏర్పాట్లు చేపడుతున్నామని నార్సింగి వ్యవసాయ మార్కెట్ యార్డు చైర్మన్ దూడల వెంకటేష్గౌడ్ అన్నారు.
మంగళవారం మార్కెట్యార్డులో పాలకవర్గ సభ్యులతో కలిసి ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత అన్నివర్గాల సంక్షేమంతో పాటు అన్నదాతకు పెద్దపీట వేస్తున్న సర్కారు టీఆర్ఎస్ ఒక్కటేనన్నారు.
ఆధునాతన మార్కెట్లను నిర్మించి రైతులు పండించిన పంటలను నేరుగా విక్రయించుకునే వీలుకల్పించిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందన్నారు. దేశనలుమూలల నుంచి వచ్చి నార్సింగిలో ప్రతియేటా నిర్వహించే పశుసంక్రాంతిని ఈసారి పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ ప్రవీణ్యాదవ్, డైరెక్టర్లు రాజ్కుమార్, రాజు, తదితరులు పాల్గొన్నారు.