బంజారాహిల్స్, జూలై 2: తలసీమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారులను ఆదుకునేందుకు జూలై 24న మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్భంగా మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేస్తున్నామని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ తెలిపారు. శిబిరంలో సేకరించిన రక్తాన్ని శివరాంపల్లిలోని ‘తలసీమియా అండ్ సికిల్ సెల్ సొసైటీ’లో చికిత్స పొందుతున్న చిన్నారుల కోసం ఇవ్వాలనుకుంటున్నామని ఎమ్మెల్యే మాగంటి ప్రకటించా రు. శివరాంపల్లిలోని సొసైటీ ఆధ్వర్యంలో నడుస్తున్న రక్త మార్పిడి కేంద్రాన్ని, బ్లడ్ బ్యాం క్ను ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ శుక్రవారం సందర్శించారు. అక్కడ అందుతున్న చికిత్స ను స్వయంగా పరిశీలించిన ఎమ్మెల్యే మాగంటి తలసీమియాతో బాధపడుతున్న చిన్నారుల పరిస్థితిని చూసి చలించిపోయారు. జన్యుపరమైన లోపాలతో చిన్నారుల్లో తలెత్తే తలసీమి యా వ్యాధి సోకిన వారికి క్రమం తప్పకుండా రక్తమార్పిడీ చేయాల్సి ఉంటుందని, సకాలం లో రక్తం దొరక్కపోతే ప్రాణాలు పోతాయని నిర్వాహకులు తెలిపారు. దీనికి స్పందించిన ఎమ్మెల్యే గోపీనాథ్ మాట్లాడుతూ, మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్భంగా జూలై 24న జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నామని, అక్కడ టీఆర్ఎస్ కార్యకర్తలు, అభిమానులు వేలాదిమంది ఇచ్చే రక్తాన్ని తలసీమియా వ్యాధిగ్రస్త చిన్నారులకు అందిస్తామని హామీ ఇచ్చారు. తలసీమియా ఎంత ప్రమాదకరమైనదో ఇక్కడ చిన్నారులను చూస్తే అర్థం అవుతుందన్నారు.