కోల్కతా: కేంద్ర మంత్రి బాబుల్ సుప్రియోకు రెండోసారి కరోనా సోకింది. తనతోపాటు తన భార్యకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యిందని ఆదివారం ఆయన తెలిపారు. తనకు రెండోసారి కరోనా సోకిందని అన్నారు. ఈ నేపథ్యంలో సోమవారం అసన్సోల్లో ఓటు వేయడం లేదని చెప్పారు. అయితే మానసికంగా బీజేపీ అభ్యర్థులతోనే ఉంటానని, ఇంటి నుంచే ఓటింగ్ తీరును పరిశీలిస్తానని వెల్లడించారు.
కాగా, బాబుల్ సుప్రియో అసన్సోల్ నుంచి రెండు సార్లు ఎంపీగా గెలిచారు. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా తాజాగా టోలీగంజ్ నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేశారు. ఆ రాష్ట్రంలోని మరో 36 అసెంబ్లీ నియోజకవర్గాలకు సోమవారం ఏడో దశ పోలింగ్ జరుగనున్నది.