కాప్రా, జూలై 30: సమాజంలో అన్నివర్గాల ప్రజలు సోదరభావంతో మెలగాలని మేడ్చల్- మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టర్ ఏనుగు నర్సింహారెడ్డి అన్నారు. శుక్రవారం కాప్రా తాసీల్దార్ గౌతమ్కుమార్ అధ్యక్షతన జరిగిన పౌరహక్కుల దినోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీలు, వెనకబడిన తరగతులకు చెందినవారు విద్యద్వారానే అభివృద్ధి సాధించాలన్నారు. ప్రభుత్వం ఇచ్చే సదుపాయాలను సద్వినియోగపర్చుకొని అభివృద్ధి చెందాలన్నారు. కింది స్థాయి వర్గాల పట్ల చిన్నచూపు తగదన్నారు. ఈ సందర్భంగా మహిళలు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలపై సభలో చర్చించారు. కార్యక్రమంలో జిల్లా సాంఘిక సంక్షేమశాఖ అధికారి వినోద్కుమార్, ఎస్ఐ అనంతాచారి, జిల్లా విజిలెన్స్కమిటీ సభ్యులు వెంకటేశ్వర్లు, రాజు వస్తాద్, సంతోశ్, నికెనర్, టీఆర్ఎస్ మైనారిటీ నాయకుడు బద్రుద్దీన్, బీజేపీ నాయకుడు మోహన్రెడ్డి, రెవెన్యూ ఇన్స్పెక్టర్ శాలిని, తదితరులు పాల్గొన్నారు.