హైదరాబాద్ : కరోనా పరిస్థితులు, లాక్డౌన్ అమలుపై సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రగతి భవన్లో జరుగుతున్న ఈ సమావేశానికి సీఎస్ సోమేశ్ కుమార్, వైద్యారోగ్య శాఖ అధికారులు హాజరయ్యారు. కరోనా కట్టడికి, లాక్డౌన్ అమలుకు తీసుకుంటున్న చర్యలపై చర్చిస్తున్నారు. ఈ నెల 30న మంత్రివర్గం సమావేశం నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది. లాక్డౌన్ పొడిగించాలా? లేదా అనే అంశంపై కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.