సిటీబ్యూరో, ఆగస్టు 27 (నమస్తే తెలంగాణ): వంద శాతం వ్యాక్సినేషన్ దిశగా గ్రేటర్ పరుగులు పెడుతున్నది. ఇందుకోసం చేపట్టిన ప్రత్యేక డ్రైవ్ విజయవంతంగా కొనసాగుతున్నది. మరోవైపు 1 నుంచి పాఠశాలల పునః ప్రా రంభం కానుండటంతో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో శానిటైజేషన్ ప్రక్రియ ఊపందుకున్నది. ఈ నేపథ్యంలో మే యర్ గద్వాల్ విజయలక్ష్మి శుక్రవారం పలు ప్రాంతా ల్లో పర్యటించారు. గౌతమినగర్ కమ్యూనిటీ హాల్, రోడ్డు నంబర్ 10లోని ఇబ్రహీంనగర్ కమ్యూనిటీ హాల్లో జ రుగుతున్న వ్యాక్సినేషన్ ప్రక్రియను పరిశీలించారు. ఫి లింనగర్లోని రౌండ్టేబుల్ స్కూల్, బంజారాహిల్స్లోని ఎం బీటీ నగర్ పాఠశాల, రోడ్ నంబర్ 7 లోని గతి ప్రభుత్వ పాఠశాలల్లో జరుగుతున్న శానిటైజేషన్ను కూ డా పరిశీలించారు. జూబ్లీహిల్స్ పంచవటి కాలనీలో వం ద శాతం వ్యా క్సినేషన్ పూర్తయిన సందర్భంగా కాలనీ సంక్షేమ సంఘం ప్రతినిధులకు అభినందన పత్రాన్ని అందించారు. మరో వారం రోజుల్లోగా అర్హులందరికీ టీకా అందిస్తామని మేయర్ తెలిపారు.