ప్రతి ఒక్కరూ విధిగా వ్యాక్సిన్కు స్లాట్ బుక్ చేసుకోవాలి
మరిన్ని సౌకర్యాలు కల్పించాలి: సమీక్షలో మేయర్ విజయలక్ష్మి
ఏ మాత్రం జ్వరం గాని, నలత ఉంటే వెంటనే సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి, బస్తీ దవాఖానకు వెళ్లి ప్రాథమిక జ్వర పరీక్షలు చేయించుకోవాలని నగర మేయ ర్ గద్వాల విజయలక్ష్మి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. జ్వరమున్న వారికి ఉచితంగా కరోన నివారణ మందుల కిట్లను అందజేస్తున్నామని, ఈ మందులను ఐదు రోజుల పాటు వాడాలని పేర్కొన్నారు. కరోనా కట్టడికై చేపట్టిన చర్యలపై శుక్రవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం లో అధికారులతో మేయర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇప్పటికే నగరంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక బృందాల ద్వారా ఇంటింటికీ ఫీవర్ సర్వే నిర్వహిస్తున్నామని చెప్పారు. ప్రతి ఒక్కరూ వ్యాక్సినేషన్కై తప్పనిసరిగా ఆన్లైన్ స్లాట్ బుక్ చేసుకోవాలని మేయర్ సూచించారు. పాజిటివ్ కేసులు ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో బల్దియా ఎంటమాలజీ, డీఆర్ఎఫ్ వి భాగాల ద్వారా హైపో క్లోరైట్ ద్రావకాన్ని స్ప్రేయింగ్ చేయిస్తున్నామని వివరించారు. బస్తీ దవాఖానలకు వచ్చే వారి సంఖ్య పెరుగుతున్నందున బస్తీ దవాఖానల్లో మరిన్ని సౌకర్యాలు కల్పించాలని ఈ సందర్భంగా అధికారులకు మేయర్ విజయలక్ష్మి ఆదేశాలు జారీ చేశారు.