ఎల్బీనగర్ జోన్లోని ఉప్పల్ నియోజక వర్గానికి చెందిన పది డివిజన్లలో జరుగుతున్న పారిశుద్ధ్య పనులను, చెరువులను, నాలాలను, శ్మశాన వాటికలతో పాటు ఇతర పనులను నగ ర మేయర్ గద్వాల్ విజయలక్ష్మీ పరిశీలించారు. సోమవా రం ఉదయం 6.30 గంటలకు నగర మేయర్ గద్వాల విజయలక్ష్మీ పర్యటన మొదలై సాయంత్రం 4 గంటలకు ముగిసింది. ఉప్పల్ ఎంఎల్ఏ బేతి సుభాష్రెడ్డి, డివిజనల్ కార్పొరేటర్లతో కలిసి ఉప్పల్లో పర్యటించారు. ఈ సందర్భంగా తొలుత హబ్సిగూడ డివిజన్లో జరగుతున్న సోడి యం హైపో క్లోరైడ్ ద్రావకం స్ప్రే పనులను పర్యవేక్షించా రు. ఆ తర్వాత హబ్సిగూడ మెట్రో స్టేషన్ వద్ద స్వయంగా స్ప్రే చేశారు. హబ్సిగూడలోని పెద్ద చెరువును స్థానిక ఎంఎల్ఏ బేతి సుభాష్రెడ్డి, కార్పొరేటర్ చేతన్లతో కలిసి సందర్శించారు. చెరువును సుందరీకరించి నాలాలను బాగు చే స్తామని హామీ ఇచ్చారు.
రామంతాపూర్లోని డివిజన్లో చిన్న చెరువును కూడా మేయర్ సందర్శించారు. అక్కడ పేరుకుపోయిన చెత్తను వెంటనే తొలిగించాలన్నారు. ఆ చెరువు సుందరీకరణ పనులను త్వరలో చేపడుతామన్నా రు. ఎంఎల్ఏతో పాటు స్థానిక కార్పొరేటర్ బండారు శ్రీవా ణి, మాజీ కార్పొరేటర్ జ్యోత్స్న పాల్గొన్నారు. ఉప్పల్ డివిజన్లోని సర్కిల్ పార్కును పరిశీలించి, ఆ తర్వాత నల్ల చెరువును, బతుకమ్మ కుంటను అభివృద్ధి చేస్తామన్నారు. స్థానికంగా అక్కడ పేరుకుపోయిన చెత్తను వెంటనే తొలిగించాలని ఆదేశించారు, చిలుకానగర్ డివిజన్, కళ్యాణపురి రోడ్డులోని ఉన్న హైటెన్షన్ అండర్ గ్రౌండ్ పనులను త్వరలోనే చేపడుతామన్నారు. బీరప్పగడ్డలోని విస్తార ఎన్క్లేవ్ వద్ద విరిగిపోయిన కల్వర్టును పునరుద్ధరణ పనులను చేపట్టాలని అధికారులను ఆదేశించారు. నాచారం డివిజన్లోని ఎర్రగుంట వద్ద పటేల్ కుంట నాలా, బస్తీ దవాఖానా, శ్మశాన వాటిక, ఇందిరానగర్ కల్వర్టు సందర్శించారు.