ఉప్పల్ జోన్బృందం. ఏప్రిల్ 26 : చెరువులను అన్ని విధాలుగా సుందరీకరిస్తామని నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి స్పష్టం చేశారు. సోమవారం రామంతాపూర్ ప్రధాన రహదారిలో ఉన్న పెద్ద చెరువును, చిన్న చెరువు, నాచారం పటేల్ కుంట చెరువు, ఉప్పల్ నల్లచెరువు, చిలుకానగర్ తదితర ప్రాంతాల్లో స్థానిక ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి, కార్పొరేటర్లు కక్కి రేణి చేతన, బండారు శ్రీవాణి, మందమూల రజిత, బన్నాల గీత, శాంతితో కలిసి సంబంధిత అధికారులు సందర్శించారు. అనంతరం స్థానిక ఎమ్మెల్యే సుభాష్రెడ్డి, స్థానిక కార్పొరేటర్లు చెరువుల సుందరీకరణ, వాకింగ్ ట్రాక్, ట్రంక్ లైన్, యూజీడీ, భగాయత్ భూముల్లోని ఇండ్లకు ఇంటి నంబర్లు, తదితర సమస్యలను మేయర్ దృష్టికి తెచ్చారు.
పెద్ద చెరువు వాకింగ్ ట్రాక్ చేయాలని, చెరువును సుందరీకరించాలని కార్పొరేటర్ చేతన, నాచారంలో కల్వట్టు పనులు వేగంతం చేయాలని కార్పొరేటర్ శాంతి మేయర్ దృష్టికి తెచ్చారు. ఏ సమస్య ఉన్నా తమకు చెప్పాలన్నారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ.. పెద్ద చెరువును, చిన్న చెరువుల, నల్ల చెరువును సుందరీకరిస్తామన్నారు. అదే విధంగా చెరువుల చుట్టూ వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేస్తామన్నారు. కోర్టు వివాదాల్లో ఉన్న కేసుల విషయాన్ని త్వరలో తాను వారితో మాట్లాడుతానన్నారు.
అన్ని సమస్యలు త్వరలో పరిష్కరిస్తామన్నారు. పారిశుధ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నామన్నారు. చెత్తను ఎప్పటికప్పుడు తొలగించాలని అధికారులను మేయర్ ఆదేశించారు. ప్రతి కాలనీలో సోడియం హైపో క్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జేసీ ఉపేందర్రెడ్డి, ఉప్పల్ డీసీ అరుణకుమారి, డీఈ నాగమణి, ఏఈ విఘ్నేశ్వరీ, మాజీ కార్పొరేటర్ గంధం జ్యోత్స్ననాగేశ్వర్రావు, మందమూల పరమేశ్వర్రెడ్డి, ప్రవీణ్ ముదిరాజ్, సాయిజెన్ శేఖర్, నాయకులు వనంపల్లి గోపాల్రెడ్డి, సుధాకర్, తదితరులు పాల్గొన్నారు.
పేదల ఆరోగ్య పరిరక్షణకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని గ్రేటర్ మేయర్ గద్వాల విజయలక్ష్మి అన్నారు. చర్లపల్లి డివిజన్, పెద్ద చర్లపల్లిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన కొవిడ్ టీకా కేంద్రాని మేయర్ గద్వాల విజయలక్ష్మి, ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి, స్థానిక కార్పొరేటర్ బొంతు శ్రీదేవిలతో కలిసి ప్రారంభించారు.
నియోజకవర్గం పరిధిలోని బస్తీ దవాఖానలతో పాటు ఆరోగ్య కేంద్రాలలో ఏర్పాటు చేసిన టీకా కేంద్రాల్లో టీకా కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యులు కౌశిక్, షీబా, నాయకులు నాగిళ్ల బాల్రెడ్డి, విద్యాసాగర్, జాండ్ల ప్రభాకర్రెడ్డి, నేమూరి మహేశ్గౌడ్, నారెడ్డి రాజేశ్వర్రెడ్డి, జయకృష్ణ, బత్తుల శ్రీకాంత్యాదవ్, బాబు గంగపుత్ర, కడియాల బాబు, భానుచందర్, కనకయ్య, చారి, రాజు, సబిత, లలితలతో పాటు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, బస్తీ దవాఖాన సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
గ్రేటర్ పరిధిలోని కాలనీల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని మేయర్ గద్వాల విజయలక్ష్మి పేర్కొన్నారు. సోమవారం ఏఎస్రావునగర్ డివిజన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో ఆమె స్థానిక ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి, స్థానిక కార్పొరేటర్ సింగిరెడ్డి శిరీషాసోమశేఖర్రెడ్డి, మాజీ కార్పొరేటర్లు పావనీమనిపాల్రెడ్డి, కొత్త రామారావులతో కలిసి పర్యటించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ శంకర్, కాప్రా మండలం తహసీల్దార్ గౌతంకుమార్, అధికారులు కోటేశ్వర్రావు, బాలకృష్ణ, ఏఎంఓహెచ్ డాక్టర్ మైత్రేయి, నాయకులు కాసం మహిపాల్రెడ్డి, సింగిరెడ్డి సోమశేఖర్రెడ్డి, మణిపాల్రెడ్డి, బేతాల బాల్రాజు, కొత్త అంజిరెడ్డి, పెద్ది శ్రీనివాస్, ఏనుగు సీతారామిరెడ్డి, గగన్కుమార్, సజ్జ రామతులసీ తదితరులు పాల్గొన్నారు.
డివిజన్ అభివృద్ధికి ప్రత్యే నిధులను కేటాయించేందుకు కృషి చేస్తానని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆమె సోమవారం మీర్పేట్ డివిజన్ పరిధిలోని ఎన్టీఆర్నగర్ బండబావి స్థలాన్ని ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి, కార్పొరేటర్ జెర్రి పోతుల ప్రభుదాస్తో కలిసి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో కాప్రా సర్కిల్ డిప్యూటీ కమిషనర్ శంకర్, ఈఈ కోటేశ్వర్రావు, డీఈ రూప, ఏఈ తిరుమలయ్యగౌడ్, టీఆర్ఎస్ నాయకులు బాల్రాజ్, నవీన్గౌడ్, మధు, రాకేశ్, శ్యామ్, వాసు, మంజుల, భద్రయ్య, మోహన్రావు, నర్సింహగౌడ్, శేఖర్, రామకృష్ణ పాల్గొన్నారు.
చిలుకానగర్లో బీరప్ప గడ్డలో హైటెన్షన్ వైర్లు ఇంటిపైన ఉండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, విసాతత్ ఎన్క్లేవ్ కల్వర్టు కుంగిపోయిందని, మల్లికార్జున నగర్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ అవుట్లెట్ కనెక్షన్లు లేక డ్రైనేజీలు పొంగుతున్నాయని తదితర సమస్యలను పర్యటనకు వచ్చిన మేయర్కు స్థానిక కార్పొరేటర్ బన్నాల గీతా ప్రవీణ్ముదిరాజ్ విన్నవించారు.
అభివృద్ధి పనులు త్వరితగతిన చేపట్టి గ్రేటర్ సర్వతోముఖాభివృద్ధియే లక్ష్యంగా పనిచేస్తానని నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి అన్నారు. సోమవారం కాప్రాసర్కిల్ పరిధిలోని పలు ప్రాంతాల్లో ఆమె విస్తృతంగా పర్యటించారు. కాప్రా డివిజన్ మాధవపురి కాలనీలో పర్యటించిన మేయర్కు, ఉప్పల్ ఎమ్మెల్యే బేతిసుభాష్రెడ్డికి, జడ్సీ, డీసీ, ఇతర అధికారులకు స్థానిక కార్పొరేటర్ స్వర్ణరాజు పూలమొక్కను అందజేసి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో జోనల్ కమిషనర్ ఉపేందర్రెడ్డి, డిప్యూటీ కమిషనర్ శంకర్, ఈఈ కోటేశ్వర్రావు, డీఈఈ బాలకృష్ణ, మాజీ కార్పొరేటర్ పావనీరెడ్డి, డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు సుడుగు మహేందర్రెడ్డి, గిరుకబాయి సురేఖ, కాలనీ ప్రతినిథులు పాల్గొన్నారు.
అవుట్ సోర్సింగ్ కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని, ప్రమాదాలకు గురైన మహిళలకు న్యాయం చేయాలని కోరుతూ సీపీఎం పార్టీ రామంతాపూర్ శాఖ, పల్లవి మహిళా సంఘం ఆధ్వర్యంలో రామంతాపూర్ పర్యటనకు వచ్చిన నగర మేయర్ గద్వాల విజయలక్ష్మికి నాయకులు ఎర్రం శ్రీనివాస్ ఆధ్వర్యంలో పలువురు వినతి పత్రం సమర్పించారు.