సిటీబ్యూరో, సెప్టెంబరు 5 (నమస్తే తెలంగాణ): పర్యావరణ పరిరక్షణ కోసం హెచ్ఎండీఏ వినాయక మట్టి ప్రతిమలను ఇంటి వద్దే ఉచితంగా అందజేసేందుకు చర్యలు చేపట్టింది. ఈ ఏడాది సుమారు 70 వేల మట్టి విగ్రహాలను తయారు చేయించింది. 200 విగ్రహాలు పైబడి అవసరం ఉన్న చోట ఫోన్ చేస్తే తమ సిబ్బంది ఇంటికే తీసుకొచ్చి ఇస్తారని పురపాలకశాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ, హెచ్ఎండీఏ కమిషనర్ అర్వింద్కుమార్ తెలిపారు. ఇప్పటికే కొన్ని ముఖ్య ప్రాంతాల్లో మట్టి విగ్రహాల పంపిణీ ప్రారంభమైందని, ఈ నెల 6,8,9 తేదీల్లో 38 ప్రాంతాల్లో విస్తృతంగా అందజేస్తామని చెప్పారు. ఆదివారం ట్యాంక్బండ్కు వచ్చిన సందర్శకులకు హెచ్ఎండీఏ అధికారులు ఉచితంగా విగ్రహాలను పంపిణీ చేశారు.