వనస్థలిపురం, సెప్టెంబర్ 3 : శ్రావణమాసం చివరి శుక్రవారం సందర్భగా ప్రశాంత్నగర్ కనకదుర్గా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళలు సామూహిక వరలక్ష్మీ వ్రతాలు చేశారు. ఉదయం నుంచి, సాయంత్రం వరకు పలు పూజా కార్యక్రమాలు జరిగాయి. ఉత్సవాలకు ముఖ్య అతిథిగా వనస్థలిపురం ఏసీపీ పురుషోత్తంరెడ్డి దంపతులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా దేవస్థాన కమిటీ, భక్తులు వారిని ఘనంగా సన్మానించారు. అనంతరం ప్రసాద వితరణ కార్యక్రమం జరిగింది. ఉత్సవాలలో దేవస్థానం చైర్మన్ సంరెడ్డి భుజంగరెడ్డి, పద్మారెడ్డి, లక్ష్మీనారాయణ, కాలనీ అధ్యక్షుడు యుగంధర్రెడ్డి, బాలాజీ, కృష్ణారెడ్డి, బూడిద నందారెడ్డి, మిట్టకంటి సత్తిరెడ్డి, నరేష్, కాశీ విశ్వనాథ్, అరుణ, వాణి, నిర్మలచౌదరి, విమల, రామస్వామి, భారతి, కళావతి తదితరులు పాల్గొన్నారు.