దుండిగల్, మార్చి 12 : అన్ని రంగాల్లో అభివృద్ధిని చాటుతున్న టీఆర్ఎస్ పార్టీకి పట్టభద్రులు పట్టం కట్టి.. సమస్యలపై అనుభవం ఉన్న సురభి వాణీదేవికి ఓటువేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గం టీఆర్ఎస్ పార్టీ ఇన్చార్జి మర్రి రాజశేఖర్రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని మర్రి లక్ష్మణ్రెడ్డి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎంఎల్ఆర్ఐటీ), సెయింట్ మార్టిన్ ఇంజినీరింగ్ కళాశాల, ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ ఇంజినీరింగ్(ఐఏఆర్ఈ) కళాశాలలో పనిచేస్తున్న అధ్యాపకులతో నిర్వహించిన ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎన్నికల ఇన్చార్జి రావుల శ్రీధర్రెడ్డి, అధ్యాపకులు, పట్టభద్రులు పాల్గొన్నారు.