దుండిగల్, ఏప్రిల్ 24: ‘అన్వేషణ-2021’ సాంకేతిక పోటీలలో మర్రి లక్ష్మణ్రెడ్డి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఎల్ఆర్ఐటీ) కళాశాలకు చెందిన విద్యార్థులు జాతీయ స్థాయిలో మొదటి బహుమతిని సాధించినట్లు కళాశాల యాజమాన్యం తెలిపింది. ఇంజనీరింగ్ విద్యార్థులలో దాగి ఉన్న పరిజ్ఞానాన్ని వెలికితీయడంతో పాటు వారిలో పోటీతత్వాన్ని పెంపొందించేందుకు గాను ప్రతి ఏడాది‘ అగస్త్య ఫౌండేషన్’ ఈ పోటీలను నిర్వహిస్తూ ఉంటుంది. కొవిడ్-19 మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో ఈ సారి ఆన్లైన్లో పోటీలు నిర్వహించింది. ఎంఎల్ఆర్టీ కళాశాలలోని ఎరోనాటికల్ విభాగానికి చెందిన విద్యార్థులు ముస్కాన్ ప్రసాద్, హరిక్రిష్ణ, మేడ్చల్ జిల్లా పరిషత్ పాఠశాల విద్యార్థులు శ్రేయ, మనీషలతో కలిసి ‘ప్లాస్టిక్ శ్రేడర్’ అనే పరికరాన్ని రూపొందించి పోటీలల్లో ప్రదర్శించారు. ఈ పరికరానికి పోటీల నిర్వాహకులు మొదటి బహుమతిని అందజేశారు. కార్యాక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.