నిజామాబాద్ : వదినతో అసభ్యంగా ప్రవర్తించిన ఓ మరిది దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన ఆర్మూరు కమలా నెహ్రూ కాలనీలో గురువారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. మక్కల రాజు అనే వ్యక్తి.. బుధవారం రాత్రి తన అన్న భార్యతో అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ విషయాన్ని బాధితురాలు తన భర్తకు చెప్పింది. దీంతో కోపంతో ఊగిపోయిన అన్న, వదిన కలిసి మక్కల రాజుపై దాడి చేశారు. బండరాయితో మోది హత్య చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇవి కూడా చదవండి..