మణికొండ : దేవాలయం కూల్చి ఆ స్థలంలో మరుగుదొడ్డిని నిర్మించేందుకు యత్నించిన కేసు వివాదస్పదం కావడంతో మణకొండ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ బిట్లు పద్మారావును భాధ్యతల నుంచి సస్పెండ్ చేస్తూ రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గురువారం ఉత్తర్వులు జారీచేశారు. మున్సిపాలిటీ పరిధిలోని నెక్నాంపూర్ గ్రామ సమీపంలో గత మార్చి నెలలో దుర్గ్గామాత దేవాలయాలన్ని కూల్చివేసి ఆ స్థానంలో రాత్రికిరాత్రే మరుగుదొడ్లను నిర్మించడంపై స్థానికంగా తీవ్రకలకలం రేపింది. ఈ వివాదంపై గత కొన్నిరోజులుగా విచారణ చేపట్టిన అధికారులు పద్మారావుకు షోకాజు నోటీసులు జారీచేశారు.
ఐదుమాసాలలో సంజాయిషీ ఇవ్వాలని ఆదేశించగా పద్మారావు ఇచ్చిన వివరణ సంతృప్తికరంగా లేకపోవడంతో జిల్లా కలెక్టర్ అమోయ్కుమార్ గురువారం కౌన్సిలర్ పద్మారావును భాధ్యతల నుంచి ఆరుమాసాల పాటు సస్పెండ్ చేస్తున్నట్లు అధికారిక ఉత్తర్వులు జారీచేశారు. ఆరుమాసాలల్లో పూర్తిస్థాయి సంజాయిషీ ఇవ్వకలేకపోతే శాశ్వతంగా భాధ్యతల నుంచి తొలగించే అవకాశాలున్నట్లు అధికారులు తెలిపారు. మణికొండ మున్సిపాలిటీలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి 8మంది కౌన్సిలర్లు, బీజేపీకి 6 గురు కౌన్సిలర్ల బలంతో ఇరుపార్టీల పొత్తుతో కాంగ్రెస్ పార్టీ చైర్మన్ పదవి, బీజేపీ వైస్ చైర్మన్ పదవులలో కొనసాగుతున్నారు. కాంగ్రెస్ పార్టీ బలం ప్రస్తుతానికి 7 కు పడిపోయింది.