హైదరాబాద్: నగర శివార్లలోని హయత్నగర్లో దారుణం జరిగింది. భార్య మృతదేహాన్ని చెద్దరులో చుట్టి హయత్నగర్లోని బాతుల చెరువులో పడేస్తుండగా ఓ వ్యక్తిని స్థానికులు పట్టుకున్నారు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని దవాఖానకు తరలించారు. మహిళ భర్త శ్రీనుతోపాటు మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.
తన భార్య అనారోగ్యంతో మృతిచెందిందని, దహణ సంస్కారాలకు డబ్బులు లేకపోవడంతో మృతదేహాన్ని పడేసేందుకు తీసుకెళ్తున్నానని నిందితుడు శ్రీను చెప్పారు. మృతురాలి ఇంటిని పోలీసులు పరిశీలించారు. అనారోగ్యమా లేదా మరేదైనా కారణమా అనే కోణంలో విచారిస్తున్నారు.