హైదరాబాద్ : ఆర్థిక సమస్యలతో భాధపడుతున్న ఓ వ్యక్తి (28) అదృశ్యమైన సంఘటన అఫ్జల్గంజ్ పోలీస్స్టేషన్ పరిధిలో గురువారం చోటు చేసుకుంది. ఎస్ఐ బాలస్వామి తెలిపిన వివరాల ప్రకారం.. అఫ్జల్గంజ్ గాంధీ గల్లీకి చెందిన విశాల్ పారిక్ వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. కాగా, ఈ నెల 2వ తేదీన ఇంట్లో ఎవరికి సమాచారం అందించకుండా విశాల్ పారిక్ బయటికెళ్లి తిరిగి ఇంటికి రాలేదు. కాగా, తన స్నేహితుడు సిద్దార్థ్ జైన్తో తన మొబైల్, ఉంగరాలను ఇంటికి పంపించాడు.
అదే రోజు విశాల్ పారిక్ సికింద్రాబాద్ ప్యారడైస్ ప్రాంతంలోని కోటక్ బ్యాంక్ ఏటీఎం నుంచి పది వేల రూ పాయలను డ్రా చేశాడని విశాల్ పారిక్ తండ్రి రాజేష్ కుమార్ పోలీసులకు ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఎంత వెతికినా ప్రయోజనం లేకపోవడంతో అఫ్జల్గంజ్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దీంతో మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు.
ఇవి కూడా చదవండి..
అన్లాక్ : 7 నుంచి స్కూల్స్, థియేటర్లు ఓపెన్
అదే ఆయన స్పెషల్..ఊరోళ్లతో ముచ్చటంటే సంబుర పడుతడు
Madhuri Dixit song : ఒలింపిక్స్లో మధురీ దీక్షిత్ పాట.. ఎందుకంటే..?