హైదరాబాద్ : రెమిడెసివిర్ ఇంజక్షన్లను అక్రమంగా అధిక ధరలకు విక్రయిస్తున్న ఇద్దరిని మల్కాజ్గిరి ఎస్ఓటీ పోలీసులు గురువారం అరెస్టు చేశారు.
జవహార్నగర్కు చెందిన డ్రైవర్లుగా పనిచేసే పబ్బొజి శంకర్, గూడెం బాబు రెడ్డి రెమిడెసివిర్ ఇంజక్షన్లను (ఒక్కోటి రూ. 30 వేలకు) విక్రయిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో నిఘాపెట్టి కూషాయిగూడ పరిధిలో ఓ కరోనా బాధిత కుటుంబానికి ఇంజక్షన్లు విక్రయిస్తుండగా పట్టుకున్నారు.
ఇద్దరిని అరెస్టు చేసి వారి నుంచి 5 రెమిడెసివిర్ ఇంజక్షన్లతోపాటు రూ. 650 నగదు, హోండా యాక్టివా వాహనంతోపాటు రెండు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వీటిని కూషాయిగూడ పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.