మల్కాజిగిరి, : జీహెచ్ఎంసీ మల్కాజిగిరి సర్కిల్ పరిధిలోని బండచెరువు నుంచి నిర్మించే నాలా పనులను ప్రాజెక్టు విభాగం నుంచి ఇంజినీరింగ్ విభాగానికి బదిలీ చేయాలని మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు కోరారు. ఈ మేరకు శుక్రవారం మంత్రి కేటీఆర్ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఇప్పటికే రూ.9 కోట్ల ప్రాజెక్టు పనులకు సంబంధించిన టెండర్లను పిలిచి ఖరారు చేశారని.. అయితే ప్రాజెక్టు విభాగం నుంచి జీహెచ్ఎంసీ ఇంజినీరింగ్ విభాగానికి పనులు అప్పగిస్తే సత్వరం పూర్తి చేయవచ్చన్నారు. మౌలాలి హన్మాన్నగర్లో రైల్వే శాఖ కాంపౌండ్ వాల్ నిర్మిస్తున్నదని.. దీంతో ఈ కాలనీవాసుల రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడుతున్నందున రైల్వే అధికారులతో చర్చించాలన్నారు. మంత్రి ని కలిసిన వారిలో మల్కాజిగిరి సర్కిల్ టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి సతీశ్కుమార్, ఆనంద్బాబు, అమర్నాథ్రెడ్డి, రాజేశ్ ఉన్నారు.