హైదరాబాద్ : ఆన్లైన్లో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ఓ యువకుడిని రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట పట్టణానికి చెందిన షేక్ సాదిక్ (25)ను సరూర్నగర్లో అదుపులోకి తీసుకున్నామని పోలీసులు పేర్కొన్నారు. నిందితుడి నుంచి రూ. 15.7 లక్షల నగదుతో పాటు క్రెడిట్ కార్డులు, కారును స్వాధీనం చేసుకున్నారు. పలు బ్యాంకుల్లో ఉన్న సాదిక్ ఖాతాల్లో రూ. 69.6 లక్షలను గుర్తించారు. మొత్తంగా షేక్కు సంబంధించిన రూ. 95.3 లక్షల ఆస్తులను సీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు.