నారాయణపేట రూరల్, మే 24 : జిల్లా దవాఖానలో కొవిడ్ చికిత్స పొందుతున్న బాధిత కుటుంబ సభ్యులు, సంబంధీకులకు జన విజ్ఞాన వేదిక, జాగృతి స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో సోమవారం జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నర్సింహారావు సగరి ఆహారం అందజేశారు. లాక్డౌన్ నేపథ్యంలో కరోన బాధిత కుటుంబసభ్యులకు బయట ఎలాంటి ఆహార పదార్థాలు లభించడం లేదన్నారు. ఇలాంటి సమయంలో ముందుకు వచ్చి 50 మందికి ఆహారం అందించడంపై పలువురు కుటుంబసభ్యులు వారికి కృతజ్ఞతలు తెలిపారు.
ధన్వాడలో..
ధన్వాడ, మే 24 : లాక్డౌన్ నేపథ్యంలో పేదవారికి, బాటసారులకు, పోలీసులు, పారిశుధ్య సిబ్బందికి సోమవారం ధన్వాడలో కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, కార్యకర్తలు ఆహార ప్యాకెట్లు, వాటర్ బాటిళ్లను అందజేశారు. కార్యక్ర మం లో బాలకృష్ణ, లక్ష్మయ్యగౌడ్, ఇర్ఫాన్, నరేందర్ తదితరులు పాల్గొన్నారు.